అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ట ద్వివేదికి ఈసీ తీరును వ్యతిరేఖిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. గోపాలకృష్ట ద్వివేదిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన 9 పేజీల లేఖ కూడా సమర్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఈ విషయంపై ఆవేదన కలుగుతుందని అందులో వివరించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.