డీఎస్ కుమారుడి సంచలన ప్రకటన..

SMTV Desk 2017-08-16 14:17:20  TRS PARTY, BJP PARTY, D. SRINIVAS, RAAJYASABHA.

హైదరాబాద్, ఆగస్ట్ 16 : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు దుగ్యాల శ్రీనివాస్ పార్టీ మారుతున్నారనే ఆరోపణలకు మరింత బలం చేకూరేలా ఆయన కుమారుడు చేసిన ఒక ప్రకటన సంచలనానికి దారి తీసింది. అయితే తానూ ఏ పార్టీ మారడం లేదని ఇదివరకే డీఎస్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తొలుత కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా డీఎస్ ను నియమించగా ఆ తర్వాత అతనికి రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని కల్పించారు. కాని ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ లో క్రియాశీలకంగా వ్యవహరించని డీఎస్, అధికారిక పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఈ నేపధ్యంలో డీఎస్ కుమారుడు అరవింద్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి" అంటూ భారీ ప్రకటన ఇచ్చారు. కాగా కొన్ని రోజుల క్రితం డీఎస్ అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బీజేపీలో చేరారు. తాజాగా అరవింద్ ఇచ్చిన ఈ ప్రకటనతో డీఎస్ కూడా బీజేపీలో చేరబోతున్నారనే చర్చ మొదలైంది.