లాభాల్లో తేలిన ఇండియన్ స్టాక్ మార్కెట్

SMTV Desk 2019-04-10 10:31:29  Sensex, Nifty, Stock market, Share markets

మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 239 పాయింట్ల లాభంతో 38,939 పాయింట్ల వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 11,672 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, విప్రో, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, ఐఓసీ, హెచ్‌సీఎల్ టెక్, వేదాంత, హీరో మోటొకార్ప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్, విప్రో షేర్లు 4 శాతానికి పైగా పెరిగాయి. అదేసమయంలో ఇండియాబుల్స్ హైసింగ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిన్, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టైటన్ షేర్లు నష్టపోయాయి. ఏసియన్ పెయింట్స్ షేరు 3 శాతానికి పైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లో ముగిశాయి. ఒక నిఫ్టీ మీడియా మాత్రమే నష్టపోయింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు బాగా పెరిగాయి.