ఆటోలో వెళ్లి నామినేషన్ వేసినందుకు ప్రకాష్ రాజ్ పై కేసు

SMTV Desk 2019-04-09 15:15:19  prakash raj, bangalore lok sabha, in dependent candidate

బెంగళూరు, ఏప్రిల్ 09: బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదైంది. నామినేషన్ వేసిన సమయంలో వినియోగించిన ఆటోకు ప్రకాశ్ రాజ్ అనుమతి తీసుకోలేదంటూ బెంగళూరులోని అశోక్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ మార్చి 22న ఆటోలో వెళ్లి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే, అనుమతి లేకుండా ఆటోలో రావడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందంటూ రిటర్నింగ్ అధికారి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.