వచ్చే ఎన్నికల్లో లగడ పాటి జోస్యం ఫలిస్తుందా ?

SMTV Desk 2019-04-09 12:57:46  Lagadapati,

ఇటీవల తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో తన జోస్యం చెప్పి కంగుతిన్న మాజీ ఎంపీ లగడపాటి రాజ్ గోపాల్.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అనే విషయంలో క్లారిటీ ఇస్తా అని ప్రకటించాడు .. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలను మే 19న వెల్లడిస్తానని లగడపాటి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన లగడపాటి ఏపీ ఎన్నికలపై మాట్లాడారు. అనుభవఙ్ఞులకే ప్రజలు పట్టం కడతారని లగడపాటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రాష్ట్ర భవిష్యత్ రీత్యా అనుభవఙ్ఞులైన నాయకుల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటేసేముందు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ప్రజలు చూస్తారని లగడపాటి చెప్పారు. కాగా లగడపాటి సర్వే ఫలితాలపై అంతటా అంచనాలు బలంగా ఉండేవి. ఆయన సర్వే ఫలితాలు కచ్చితంగా నిజమవుతాయని నమ్మేవారు