మద్యం ప్రియులకు షాక్...మూడు రోజులు వైన్స్ క్లోజ్!!!

SMTV Desk 2019-04-09 12:53:39  wines, loksabha elections, election commission of india, excise commission

హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా మధ్య ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల9 నుండి 11వ తేదీ వరకు మద్యం షాపులు మూసివేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 9వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి మొదలు 11 వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి. వీటితో పాటు కల్లు దూకాణాలు కూడా మూతపడనున్నాయి. ఎన్నికల దృష్ట్యా వైన్ షాపులు, కల్లు డిపోలు, బార్లను మూసివేయాలని తెలంగాణ ఏసైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.