రన్నింగ్ ట్రైన్ ఎక్కి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి .. పంజాబ్ లో దారుణం

SMTV Desk 2019-04-09 11:49:42  Punjab, Luthiyana,

పంజాబ్‌లోని లుథియానా రైల్వేస్టేషన్‌లో ఈ రోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కబోతూ.. ఓ వ్యక్తి రైలు కింద పడిపోయాడు. కాలుజారి కిందపడటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సదరు వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వ్యక్తి రైలు కిందపడిపోతుంటే ప్లాట్‌ఫామ్ మీద ఉన్న జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కళ్ల ముందే నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడి ప్రయాణికులు. రన్నింగ్ ట్రైన్ ఎక్కరాదని చాలా సార్లు విజ్ఞప్తి చేసినప్పటికి ఎవరూ.. పట్టించుకోవడం లేదని అధికారులు వాపోతున్నారు.