తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మొగనుంది. లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం లోక్సభ పోలింగ్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జరుపుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోక్సభ ఫలితాల తర్వాతే స్థానిక సంస్థల ఫలితాలు వెల్లడించాలని ఈ సందర్భంగా ఈసీ సూచించింది. ఈనెల మూడో వారంలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. మే నెలలో ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎన్నికలను రెండు లేదా మూడు విడతల్లో చేపట్టనున్నారు. విడతలపై రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రస్తుతం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ప్రతిపాదనలను తీసుకుంటోంది. 2014 లో ఒకే విడతలో ఈ ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి జిల్లాలు పెరిగిన నేపథ్యంలో ఎక్కువ విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది.