ఇస్లామాబాద్: ఈ నెలలో భారత్ మాపై మరో దాడికి సిద్దమవుతోందని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ముల్తాన్లో మీడియాతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ...ఏప్రిల్ నెలలో భారత్ పాక్ భూభాగంపై మరో దాడి చేసేందుకు సిద్ధమవుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయని, మాకు అందిన సమాచారం మేరకు ఏప్రిల్ 16-20 మధ్యలో ఈ దాడి జరగవచ్చని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మాకు నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.’’ అని ఖురేషీ వెల్లడించారు.