రాజకీయ ప్రయాణంలో అన్నీ లోతులే

SMTV Desk 2019-04-09 11:19:00  ycp

కొందరు నాయకులు తీసుకునే నిర్ణయాలు వారి రాజకీయ భవిష్యత్తునే అంధకారంలోకి నెట్టేస్తుంటాయి. ఒక్కసారి తప్పటడుగు వేస్తే తరవాత సరిదిద్దుకుందామనుకున్నా కుదరదు. ఆలా రాంగ్ స్టెప్ వేసి దెబ్బతిన్న వాళ్లలో సత్యవేడు మాజీ ఎమ్మెల్యే ఎం. సురాజ్ ఒకరు. 1984, 1994లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 1997లో టీడీపీని వదిలేసి కుటుంబ కలహాల కారణంగా లక్ష్మీ పార్వతి స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీలో చేరారు.

అప్పటి నుండి ఆయన రాజకీయ ప్రయాణంలో అన్నీ లోతులే. లక్ష్మీ పార్వతి పార్టీ అంతర్థానం అయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అక్కడా ప్రాముఖ్యత దొరక్క బీజేపీలో చేరారు. అక్కడ కుడా పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో వైకాపాలోకి వెళ్లి టికెట్ పొందాలని అనుకున్నారు. కానీ కుదరకపోవడంతో గత నెలలో టీడీపీలో చేరారు. కానీ చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో అసంతృప్తి చెందిన ఆయన మళ్ళీ టీడీపీని వీడి వైకాపాలో చేరేందుకు సిద్ధమయ్యారు.