పిల్లికి బిచ్చం పెట్టని నాగబాబుకి ఓటు వెయ్యొద్దు: శివాజీ రాజా

SMTV Desk 2019-04-08 21:12:56  shivaji

గెలుపు ఓటమి లనేవి ఎవరికైనా సహజం. మా అసోసియేషన్ ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆరు వందలకు పైగా మెంబెర్స్ ఉన్న మా అసోసియేషన్ కే నాగబాబు ఏమి చెయ్యలేదు నర్సాపురంకి ఏమి చేస్తాడని శివాజీరాజా అన్నారు. ఈమధ్య జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ప్రెస్ మీట్ పెట్టిమరీ శివాజీరాజాని విమర్శించారు నాగబాబు. జీవిత రాజశేఖర్ లు ఉన్న నరేష్ ప్యానెల్ ను గెలిపించాలని కోరారు. దీనికి కౌంటర్ గా రిటర్న్ గిఫ్ట్ సమాధానంగా శివాజీరాజా ఆదివారం హోటల్ ఉలవచారులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... చిరంజీవి గారు నాకు 30 ఏళ్ల నుంచీ నాకు తెలుసు. ఆయన మా లాంటి వారందరికీ ఆదర్శం. ఆయన నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య. ఆయన్ని మేము దేవుడు లాగా కొలుస్తాము. పవన్ కళ్యాణ్ అన్నా కూడా నాకు చాలా అభిమానం. ఆయనలో ఒక విజన్ ఉంది, ఒక డేర్ ఉంది. వీరిద్దరి మధ్య పుట్టిన నాగబాబుకి ఏ విజన్ లేదు. ఏ రకంగాను ఆదర్శంగా తీసుకోడానికి పనికిరాడు. నేను సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. అతను అలా కాదు. ఏ రకంగా నర్సాపురం వెళ్లి ఓట్లు అడుగుతాడు అని ధ్వజమెత్తారు.

అలాగే ఇంకా ఆయన మాట్లాడుతూ.. 600 మంది ఉన్న మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే మా అసోసియేషన్ కు ఏమి చెయ్యలేదు. లక్షలాది ప్రజాలున్న నర్సాపురానికి ఏమి చేస్తావు. ఏనాడైనా నర్సాపురం వెళ్ళారా కనీసం దాని బోర్డర్స్ తెలుసా. ఏనాడైనా అక్కడి ప్రజలకు ఏదైనా చేసారా. పిల్లికి బిచ్చమ్ కూడా పెట్టని నాగబాబు ఏ విధంగా అక్కడకు వెళ్లి ప్రజల్ని ఓటు వేయమని అడుగుతున్నారని మండిపడ్డారు. ఆయన ప్రసంగాలన్నీ వింటున్నామని.. కులాలను రెచ్చగొట్టేవిధంగా ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా అసలు నాగబాబు ఏమి చెయ్యాలనుకుంటన్నారో చెప్పాలని.. అసవసరంగా కులాలను రేచ్చగొట్టొద్దని శివాజీ రాజా వివరించారు.