హైదరాబాద్, ఆగస్ట్ 15 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తమ సొంత నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ కార్యాలయంలో తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేవలం కార్యాలయంలోనే కాకుండా తన నివాసంలో కూడా బన్ని జాతీయ జెండాను ఎగురవేసినట్టు ఆయన అభిమానులు తెలియజేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకలలో అర్జున్ భార్య స్నేహా రెడ్డి, కుమారుడు అయాన్, కూతురు అర్హ కూడా పాల్గొన్నారు.