ఢిల్లీ : ఢిల్లీలోని నరేలా పారిశ్రామికవాడలో ఉన్న ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు 22 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. షార్టుసర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మార్చి నెలలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉండే సీజీఓ కాంప్లెక్స్లోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని భారీగా ఆస్తి నష్టం జరిగింది. పండిట్ దీన్దయాళ్ అంత్యోదయ భవన్ ఐదో ఫ్లోర్లో మంటలు చెలరేగిన ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ ఉద్యోగి మరణించాడు. సీజీఓ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదానికి సరిగ్గా నెలరోజుల ముందు ఢిల్లీలోని కరోల్బాగ్లోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 17 మంది మరణించిన విషయం కూడా విదితమే.