‘‘నాపై దాడి చేసిన వ్యక్తుల ఫొటోలు నా వద్ద ఉన్నాయి. దమ్ముంటే జగన్ నాతో చర్చకు రావాలి’’

SMTV Desk 2019-04-08 16:54:18  jagan, kapaul,

కేఏ పాల్ భీమవరం అసెంబ్లీ, నరసాపురం లోక్ సభ స్థానాల నుంచి పోటీకి నిలుచున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమవరంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న పాల్ అక్కడే ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. అయితే, అర్ధరాత్రి పాల్ గట్టిగా కేకలు పెట్టడంతో అంతా ఉలిక్కిపడ్డారు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, వెంటనే సీసీటీవీ కెమెరా దృశ్యాలను తనకు ఇవ్వాలంటూ హోటల్ సిబ్బందిని కోరారు. అయితే, కంప్యూటర్ పనిచేయడం లేదని సిబ్బంది తెలపడంతో పాల్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తనకు సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ ఇస్తారా.. లేదా అంటూ ఆయన హంగామా చేశారు.

దీంతో ఎట్టకేలకు హోటల్ సిబ్బంది ఆ ఫుటేజ్‌ను ఆయనకు అందించారు. అయితే భీమవరంలోని అతిథి హోటల్‌లో తనపై దాడి చేసిన దుండగులు వైసీపీ మనుషులేనని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాపై దాడి చేసిన వ్యక్తుల ఫొటోలు నా వద్ద ఉన్నాయి. దమ్ముంటే జగన్ నాతో చర్చకు రావాలి’’ సవాల్ విసిరారు. తను దేనికైనా రెడీ అని ఇలా చేతకాని పిచ్చి పిచ్చి వేషాలు ఎందుకు వేస్తావని చిల్లర చిల్లర వేషాలు వేయద్దని ఆయన పేర్కొన్నారు.