ఏపీలో ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని

SMTV Desk 2019-04-08 16:11:20  AP, Yogi adityanatha,

తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఇవాళ పర్యటించనున్నారు. ఏపీలో ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్న బీజేపీపార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా సహా కేంద్రమంత్రులు ఇది వరకే ఓసారి ఏపీలో ప్రచారం చేసి వెళ్లారు. తాజాగా, నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏపీకి రానున్నారు. చిత్తూరులో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఆయన రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఏపీలో అడుగుపెట్టడానికి ముందు తెలంగాణలోని పెద్దపల్లి పట్టణంలోని జూనియర్ కాలేజీలో బీజేపీ బహిరంగ సభలో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత జహీరాబాద్‌లోని ఎల్లారెడ్డిలో ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలలో జరిగే ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొంటారు.