విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) యూనిట్లో ఈ రోజు భారీ పేలుడు సంభవించింది. ఎంఎస్ బ్లాకులోని కంటిన్యువస్ కేటలైటిక్ రిఫార్మర్(సీసీఆర్) విభాగంలో మధ్యాహ్నం పేలుడు జరిగింది. ఇద్దరు కార్మికులు గాయపడ్డరు. అగ్నిమాపక సిబ్బంది వెంకటే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.
ఈ చమురు శుద్ధి కర్మాగారం రోజుకు 1.66 లక్షల బ్యారళ్ల గ్యాసోలిన్ ఉత్పత్తి చేస్తోంది. పేలుడు జరగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. యూనిట్ ను తాత్కాలికంగా మూసేశామని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని హెచ్పీసీఎల్ అధికారులు తెలిపారు.