విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఓటమికి కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీనే కారణమని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన చెన్నై ఆఖరికి 133/8కే పరిమితమైంది. గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై మెరుపు అర్ధశతకంతో టీమ్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన ధోనీ.. నిన్న రాత్రి 21 బంతులాడి 12 పరుగులే చేయగలిగాడు. క్రీజులోకి వచ్చిన ధోనీ దాదాపు పది ఓవర్లు క్రీజులో ఉన్న ధోనీ కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతని జిడ్డు బ్యాటింగ్ కారణంగా.. ఆఖర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోగా.. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో తొలిసారి బ్యాట్ ఝళిపించేందుకు ప్రయత్నించి.. ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కాడు. అప్పటికే చేయాల్సిన రన్రేట్ 12.50గా ఉండటంతో.. మిగిలిన బ్యాట్స్మెన్స్ కూడా ఏమీ చేయలేకపోయారు. ముంబయి ఇండియన్స్ అగ్రశ్రేణి బౌలర్లని వదిలేసినా.. ధోనీ కనీసం జూనియర్ బౌలర్ల పనిపట్టినా.. చెన్నై సులువుగా గెలిచేదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. చేతిలో ఏడు వికెట్లు ఉన్నా.. 15వ ఓవర్ వరకూ ధోనీ బ్యాట్ ఝళిపించకపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది..!