సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కరీంనగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, కరీంనగర్ సభకు అమిత్ షా హాజరుకాలేదు. ప్రధాని మోదీతో అత్యవసర సమావేశం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాగా తాజా సమాచారం ప్రకారం అమిత్ షా వరంగల్ పర్యటన కూడా రద్దు అయినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పెద్దఎత్తున్న బహిరంగసభలకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ సభకు హాజరు కాలేకపోయినా వరంగల్కు ఆలస్యంగానైనా అమిత్ షా వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ వరంగల్ పర్యటన కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సభలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.