ఏపీ సర్కార్‌కు భారీ షాక్.. రూ.100 కోట్లు జరిమానా

SMTV Desk 2019-04-04 17:19:31  Chandrababu,

ఏపీ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. రూ.100 కోట్లు జరిమానా విధించింది. కృష్ణానదితో పాటు, ముఖ్యమంత్రి నివాసం సమీపంలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల‌లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, ఈ నిర్నయం తీసుకుంది.

అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు.. నివేదికలు తయారు చేసి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్లు జరిమానా విధించింది.