నిరుద్యోగులకు మరో శుభవార్త

SMTV Desk 2019-04-04 17:06:59  Jobs,

ఎంప్లాయ్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
న్యూ ఢిల్లీలోని ఎంప్లాయ్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఈఎస్‌ఐసీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 2, 258 ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు.. అందులో తెలంగాణకు 133, ఆంధ్రప్రదేశ్‌కి 337 ఉద్యోగాలను కేటాయించారు. పోస్టులను బట్టి ఇంటర్, డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు : 2,258

పోస్టులు : స్టెనో గ్రాఫర్, యూడీసీ
విద్యార్హత : స్టెనో గ్రాఫర్ ఇంటర్, ఇంగ్లీష్/హిందీ టైపింగ్ తెలిసి.. నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలగాలి.. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి
యూడీసీ పోస్టులకి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి