పంజాబ్ లో సంచలనం .. కోడలితో ఆ.. పనికి అడ్డొస్తున్నాడని ?

SMTV Desk 2019-04-04 17:03:31  Punjab, illegal relationship

వివాహేతర సంబంధాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. కొందరైతే మరీ వావీ వరుసలు మరిచి, వివాహేతర సంబంధం పెట్టుకుంటూ, అందుకు అడ్డొస్తే కన్నవారినైనా, కట్టుకున్నవారినైనా కడతేర్చడానికి వెనుకాడడం లేదు. తాజాగా కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మామ, అందుకు అడ్డంగా ఉన్న కన్న కొడుకును అతిదారుణంగా హత్య చేసాడు. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్రంలోని ఫరీదాకోట్ ఏరియాకు చెందిన 60 ఏళ్ల చోటా సింగ్ అనే వ్యక్తికి ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రాజ్వీందర్ సింగ్‌కు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. భార్య జస్వీర్ కౌర్‌తో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు రాజ్వీందర్ సింగ్. ఇదిలా ఉండగా కొన్నాళ్లు తన దగ్గర ఉంచుకునేందుకు తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు రాజ్వీందర్ సింగ్. అయితే కొడుకు ఆఫీసుకు వెళ్లిన సమయంలో కోడలు జస్వీర్‌కౌర్‌తో ఇంట్లో ఒంటరిగా ఉండే చోటా సింగ్... ఆమెను లొంగదీసుకున్నాడు.

రాజ్వీందర్ సింగ్‌కు తెలియకుండా ఇద్దరూ శారీరక సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. కొన్నాళ్లకు మామా-కోడళ్ల మధ్య కొనసాగుతున్న ఆ సంబంధాన్ని గుర్తించాడు కొడుకు. తండ్రిని చిన్నకొడుకు దగ్గర దించిరావాలని అనుకున్నాడు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకును చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. రాత్రి పడుకున్న తర్వాత రాజ్వీందర్ సింగ్‌పై కత్తితో దాడి చేసిన చోటా సింగ్... శవాన్ని ముక్కలు ముక్కలు చేసి బ్యాగులో పెట్టి డ్రైనేజీలో పడేశాడు. చోటా సింగ్, జస్వీర్ కలిసి బాడీని తీసుకుని డ్రైనేజీలో పడేయడానికి వెళ్లిన సమయంలో వారి ఇంటికి మేనల్లుడు వచ్చాడు. గదిలో రక్తం చూసి, కంగారు పడి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... చోటాసింగ్‌ను తమదైన శైలిలో నిలదీయగా విషయం బయటికి వచ్చింది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.