చౌకీదార్ నిద్రపోయాడా? రేణుకా చౌదరి ఫైర్

SMTV Desk 2019-04-04 16:57:53  Choukidar, renuka choudary, modi

“విజయ్ మాల్యా, నీరావ్ మోడీ, చోక్సీ వంటివారు బ్యాంకులను దోచుకొని విదేశాలకు పారిపోతుంటే దేశానికి చౌకీదార్ (కాపలాదారు)నని చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్రమోడీ నిద్రపోతున్నారా?” అని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్ధి రేణుకా చౌదరి ప్రశ్నించారు. నీరవ్ మోడీ వంటివారు ప్రజాధనం దోచుకొంటుంటే చౌకీదార్ ఏమిచేస్తున్నారని ప్రశ్నించారు. చౌకీదార్ మోడీ ప్రజలకు ఏమి సమాధానం చెపుతారని రేణుకా చౌదరి ప్రశ్నించారు.

“ఒకపక్క నీరవ్ మోడీవంటి ఆర్ధిక నేరగాళ్ళు ప్రజాధనాన్ని దోచుకొంటుంటే, చౌకీదారునని గొప్పలు చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్రమోడీ వేలకోట్లు ప్రజాధనం దుబారా చేస్తూ ప్రత్యేక విమానాలలో విదేశాలలో విహారయాత్రలు చేస్తున్నారు. ప్రధాని మోడీ నోట్లరద్దు, జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు తప్ప దేశానికి ఉపయోగపడే పనులేమీ చేయలేకపోయారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన నెహ్రూ కుటుంబం మాత్రమే దేశ సమగ్రతను కాపాడగలదు. దేశాభివృద్ధి చేయగలదు. కాంగ్రెస్ పార్టీ అయితేనే దేశంలో అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తుంది. కనుక రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్ధులకె ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని రేణుకా చౌదరి అన్నారు.