ఆ ప్రాంతం సురక్షితం కాదని ఖాళీ చేయిస్తున్న అధికారులు..!!

SMTV Desk 2017-08-15 13:16:01  HIMACHAL PRADESH, BUS ACCEDENT, VILLEGE, FORENSIC OFFICERS

సిమ్లా, ఆగస్ట్ 15 : హిమాచల్‌లోని కోట్‌పురి వద్ద 55 మంది ప్రయాణిస్తున్న రెండు బస్సులపై ఒక్కసారిగా కొండచరియలు విరుచుకుపడిన ఘటన తెలిసిందే. అయితే ఆ ప్రదేశం ఎంత మాత్రం సురక్షితం కాదంటూ అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మండీ-పఠాన్‌కోట్ జాతీయ రహదారికి సమీపంలోని గ్రామ౦ మొత్తాన్ని ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అంతేకాదు, మళ్ళీ కొండచరియలు విరిగి పడే అవకాశాలు ఉండడంతో రాత్రిపూట రోడ్డు రవాణా సర్వీసుల్ని రద్దు చేసింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటికే 46 మంది చనిపోగా, మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మరికొంతమంది తీవ్ర గాయాలపాలు కాగా, మరీ తీవ్రంగా దెబ్బతిన్న మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు.