ముంబయి : మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళంక్’. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఇప్పటికే విడుదలై అభిమానుల అంచానాలు తారాస్థాయికియ చేర్చాయి. అయితే తాజాగా.. సినిమా ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. ఓ ప్రేమకావ్యాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లు కళంక్ టీజర్ను చూస్తే అర్ధమవుతోంది. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్గా ఉంది.ఏప్రిల్ 17న ’కళంక్‘ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాత కరణ్ జోహార్ సన్నాహాలు చేస్తున్నారు.