అనంత్ నాగ్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి ముఫ్తీ

SMTV Desk 2019-04-04 16:21:41  Jammu and Kashmir Chief Minister Mehbooba Mufti, loksabha elections, ananthnag constituency

జమ్మూకాశ్మీర్ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ అనంత్ నాగ్ లోక్ సభ స్థానం నుంచి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎంగా పనిచేసిన ముఫ్తీ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. బీజేపీ మద్ధతు ఉపసంహరించుకోవడంతో కశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఈసారి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించేందుకు నామినేషన్ దాఖలు చేసింది ముఫ్తీ. అయితే ముఫ్తీకి ప్రత్యర్థిగా బీజేపీ సోఫీ మహమ్మద్ యూసుఫ్ ను బరిలో నిలిపింది. ఇటు కాంగ్రెస్ జమ్మూ పీసీసీ చీఫ్ గులామ్ అహ్మద్ మీర్ ను పోటీకి నిలిపింది. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు తమ నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో అభ్యర్థుల సంఖ్య ఆరుకు చేరింది.