వెండి ఎగిసింది...పసిడి తగ్గింది

SMTV Desk 2019-04-03 17:45:24  Gold Rate, Silver rate, Bullion market

న్యూఢిల్లీ : దేశీయ మార్కెట్లో గత రెండు రోజులుగా ఎగిసిపడుతున్న బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.32,750కు క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.20 పెరుగుదలతో రూ.38,420కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.32,750కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గుదలతో రూ.32,580కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,520కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,020కు క్షీణించింది. కేజీ వెండి ధర రూ.40,300 వద్ద స్థిరంగా ఉంది.