కేంద్ర పథకాలకు అడ్డు పడుతోంది!

SMTV Desk 2019-04-03 17:43:26  narendra modi, mamata benarji, bjp

కోల్ కతా : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సిలిగురిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సిఎం మమతా బెనర్జీ స్పీడ్ బ్రేకర్ అని విమర్శించారు. అంతేకాక కేంద్ర పథకాలు అమలు కాకుండా మమతా అడ్డుపడుతోందని మండిపడ్డారు. బాలాకోట్ ఘటనతో దీదీ ఇబ్బంది పడ్డారని, జాతి వ్యతిరేక శక్తులకు అడ్డుగోడలా తాము నిలుస్తామని మోడీ స్పష్టం చేశారు.