అమెరికాకు చెందిన ఎంహెచ్-60 ఆర్ యుద్ధ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేయనుంది. సుమారు 24 హెలికాప్టర్లను అమెరికా, భారత్కు విక్రయించబోతుంది. భారత్కు ఈ హెలికాప్టర్లను అమ్మేందుకు అమెరికా కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. ఎంహెచ్-60 ఆర్లను మల్లీ మిషన్ హెలికాప్టర్లుగా పిలుస్తారు. లేదా సీహాక్ చాపర్స్ అని కూడా అంటారు. ఇవి జలాంతర్గాములను, నౌకలను ట్రాక్ చేసి, అటాక్ చేస్తాయి. ఈ హెలికాప్టర్ల రాకతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలపడనుంది. డీల్ విలువ సుమారు 260 కోట్ల డాలర్లు. ప్రధాన కాంట్రాక్టరుగా లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఉంది.