శ్రీలంక పేసర్ లసిత్ మలింగా ఐపీఎల్ 2019 సీజన్లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే మలింగకు.. ఈ సీజన్ లో తొలుత ఐపీఎల్ ఆడడానికి అనుమతిచ్చిన శ్రీలంక క్రికెట్.. తన అనుమతిని వెనక్కి తీసుకుంటూ.. వెంటనే మలింగ స్వదేశానికి రావాలని కబురు పంపింది. ప్రపంచ కప్ దగ్గర పడుతుండడంతో అతనిని శ్రీలంకలో గురువారం నుంచి ప్రారంభంకాబోయే సూపర్ ప్రొవిన్సియల్ వన్డే టోర్నీలో ఆడించాలని లంక బోర్డు నిర్ణయించింది. దీంతో అతను బుధవారం శ్రీలంక బయల్దేరి వెళ్లనున్నాడు. అక్కడ జరగబోయే టోర్నీలోని గాలె జట్టుకు లసిత్ మలింగ నాయకత్వం వహించనున్నాడు.