రూ. 2కోట్ల విలువైన బంగారం పట్టివేత!

SMTV Desk 2019-04-03 15:11:38  gold, rajasthan, sirohi, elections

జైపూరు : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజస్థాన్‌ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సిరోహి జిల్లాలో రెండు కోట్ల రూపాయల విలువైన పదికిలోల బంగారు నగలను పట్టుకున్నారు. అహ్మదాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండుకోట్ల రూపాయల విలువగల బంగారు నగలను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బంగారం సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నగలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళుతున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.