జైషే ఉగ్రవాది నిసార్‌ అహ్మద్‌ అరెస్ట్

SMTV Desk 2019-04-03 15:10:20  jaish e Chief Masood Azhar, pakistan, india, nissar ahmed

దుబాయ్ : దుబాయ్‌ లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జైషేకు చెందిన నిసార్‌ అహ్మద్‌ తాంత్రేను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2017 డిసెంబర్‌ లో జమ్మూకశ్మీర్‌ లెత్‌ పోరా ఉగ్రదాడికి వ్యూహారచన చేసి..ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న తాంత్రేను ఎట్టకేలకు పట్టుకున్నారు. ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. దక్షిణ కశ్మీర్ జైషే డివిజనల్ కమాండర్ నూర్ తాంత్రే సోదరుడైన నిసార్.. ఎన్నో దాడులకు స్కెచ్‌ గీశాడు. కేవలం నాలుగు అడుగులు మాత్రమే ఉండే నిసార్‌కు జైషేలో ప్రత్యేక గుర్తింపు ఉంది.