పాకిస్తాన్, ఆగస్ట్ 14: నేడు పాకిస్తాన్ 71వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంది. మా దేశంపై దాడి చేసే ఈ వేడుకల్లో పాల్గొన్న దేశం ఏదైనా వారి బుల్లెట్లు అయిపోవాలే తప్ప తమ సైనికుల గుండెల్లోకి మాత్రం అవి వెళ్లలేవంటూ శత్రుదేశాలకు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు కమర్ జావేద్ బజ్వా హెచ్చరికలు చేశారు. ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ... ఎవరు తమ టార్గెట్ని బలహీనపర్చలేరని, పాక్ రాజ్యాంగబద్ధంగా అభివృద్ధి వైపు పయనిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మా దేశానికి వ్యతిరేకంగా ఉండే ఎలాంటి ప్రయత్నాన్ని అయిన తిప్పి కొడతాం అని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి త్యాగాలను మర్చిపోలేమని ఆయన తెలిపారు. పాక్కి ప్రతీ సమస్యను జాతీయవాద భావంతో అధిగమిస్తూ ముందుకు సాగిపోతామని ఆయన స్పష్టం చేశారు.