ప్రత్యేక హోదా వలన ఒరిగేది ఏమీ లేదు

SMTV Desk 2019-04-03 15:04:27  Chandra Babu, Piyush goyal

విజయనగరం: చంద్రబాబు పై కేంద్రమంత్రి పీయుష్ గోయల్ తీవ్ర విమర్శలు చేశారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ ‘అశోక్ గజపతిరాజు ఎంపీగా గెలవడానికి మోదీ ఎంతో సహకరించారని అన్నారు. మొదట్లో కేంద్రం అడిగిన దాని కంటే ఎక్కువ నిధులు ఇస్తోందన్న చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించి.. నిధులు మంజూరు చేస్తే.. దోచుకోవాల్సినంత దోచుకున్నారు అని ఆరోపించారు. అంతేకాదు తెలుగు వారందరికీ చంద్రబాబు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వలన ఒరిగేది ఏమీ లేదని.. అన్నీ ఆలోచించే రైల్వే జోన్ ఇచ్చాం’ అని అన్నారు.