పద్ధతి మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తారు : ఏపీ మంత్రి సోమిరెడ్డి

SMTV Desk 2017-08-14 19:05:08  nandhyala, elections, jagan, chendrababu nayudu, balakrishna

నంద్యాల, ఆగస్ట్ 14 : నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా వైసీపీ అధినేత జగన్ రోజుకో వ్యాఖ్యలు చేస్తుండడంతో ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చొక్కా, మంత్రి ఆదినారాయణరెడ్డి నిక్కరు విప్పుతానంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఇలా జగన్ రోజు రోజుకి దిగజారి మాట్లాడడం ఏం బాగోలేదంటూ వ్యాఖ్యానించారు. మాట్లాడే పద్దతిని కనుక ఆయన మార్చుకోకపోతే నంద్యాల ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తారని ఏపీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. అంతేకాకుండా చొక్కాలు, నిక్కరు విప్పుతామంటున్నా వైసీపీ నేతలు బాడీ మసాజ్ సెంటర్ పెట్టుకుంటే మంచిదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ, బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఉపఎన్నిక రోడ్ షోలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ పాల్గొంటారని ఆయన తెలిపారు.