పాకిస్తానీ పోస్ట్‌లను ధ్వంసం చేసిన భారత సైన్యం

SMTV Desk 2019-04-03 12:36:48  Pakistan

జమ్ముకశ్మీర్ : సరిహద్దుల్లో మాటిమాటికి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్‌కు భారత సైన్యం ధీటైన జవాబిచ్చింది. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలపై మాటిమాటికీ పాక్ కాల్పులకు తెగబడుతుంది. దీంతో భారత సైన్యం పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పింది. ఎల్‌వోసీని ఆనుకుని ఉన్న ఏడు పాకిస్తాన్ పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనతో పాక్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉన్నందున… ముందు జాగ్రత్తగా పూంచ్, రాజౌరీ సెక్టార్లలో సరిహద్దు వెంబడి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సమీప ప్రాంతంలో భారీ భద్రతా బలగాలను మోహరించారు.