మల్టీ‌ స్టారర్ లో కీర్తి సురేష్..?

SMTV Desk 2019-04-03 12:29:05  Keerthy suresh,

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అందులో ఒకటి తెలుగు సినిమా కాగా, మరొకటి హిందీ సినిమా. ఇక వీటితో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కీర్తి సురేష్. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో యువరాణి కుందవాయ్ పాత్రలో కీర్తి కనిపించనుందట.

మరోవైపు ఈ చిత్రంలో కార్తీ, జయం రవి , మోహన్ బాబు , అమితాబ్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.