ఒక్క విజయం సాధించక పోవడం నిజంగా ఆలోచించే విషయమే

SMTV Desk 2019-04-03 12:27:20  RCB, abd

జైపూర్: వరుస పరాజయాలు చవిచూస్తుండడం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు ఎబి.డివిలియర్స్ అన్నాడు. ఓటములను తాము జీర్ణించుకోలేక పోతున్నామన్నాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ ఈ విషయం చెప్పాడు. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క విజయం సాధించక పోవడం నిజంగా ఆలోచించే విషయమేనన్నాడు. తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తాము నిరాశే మిగుల్చుతున్నామని వాపోయాడు. అయితే మిగిలిన మ్యాచుల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నామన్నాడు. తనతో పాటు కోహ్లి, మోయిన్ అలీ, హెట్‌మెయర్ తదితరులు ఉన్నా ఫలితం లేకుండా పోతుందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలం కావడం తమ ఓటమికి ప్రధాన కారణమన్నాడు. మిగిలిన మ్యాచుల్లో గెలిచి అభిమానులకు ఊరట కల్పించడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమన్నాడు. దీని కోసం సమష్టిగా పోరాడుతామని డివిలియర్స్ స్పష్టం చేశాడు.