విజయమ్మ చేస్తున్న ప్రచారం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు

SMTV Desk 2019-04-02 21:08:17  ys vijayamma

ప్రస్తుతం వై ఎస్ కుటుంబం అంతా జగన్ గెలుపు కోసం పెద్ద ఎత్తునే చెమటోడుస్తున్నారు.జగన్ తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల జగన్ గెలుపు కోసం పెద్ద ఎత్తునే ప్రచారం చేస్తున్నారు.ఈ ప్రచారంలో భాగంగా ప్రస్తుతం జగన్ తల్లి ఉత్తరాంధ్రా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసినదే.అయితే ఇప్పుడు విజయమ్మ చేస్తున్న ఈ ప్రచారం పట్ల తీవ్ర స్థాయిలో కొన్ని విధానపరమైన విమర్శలు ఇతర పార్టీల అభిమానులు చేస్తున్నారు.అవేమిటంటే అసలు ఇప్పుడే ఎందుకు విజయమ్మకు శ్రీకాకుళం గుర్తొచ్చింది.గత ఐదు సంవత్సరాల నుంచి రాని జగన్ మరియు విజయమ్మలు అకస్మాత్తుగా ఎందుకు వచ్చేసారని ప్రశ్నిస్తున్నారు.

గత కొన్ని నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాను కుదిపేసిన తిత్లీ తుఫాను సమయంలో పక్కనే విజయనగరంలో ఉండి కూడా జగన్ రాలేదని అప్పుడు గుర్తు రాని శ్రీకాకుళం ప్రజలు ఇప్పుడు ఎందుకు వీరికి గుర్తోచేశారని ప్రశ్నిస్తున్నారు.ఓహో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓట్లు అడగడానికి వచ్చారా అని ప్రశ్నలు కురిపిస్తున్నారు.కష్టకాలంలో ఉన్నపుడు రావాల్సింది పోయి ఇప్పుడు తన బిడ్డను ముఖ్యమంత్రి చెయ్యమనేందుకు వచ్చారని అసలు అక్కడ ప్రచారం చేసే హక్కు విజయమ్మకు లేదని సోషల్ మీడియాలో ఇతర పార్టీల వారు అంటున్నారు.ఆ తుఫాను వచ్చిన సమయంలో జగన్ చేసిన ఆ తప్పిదమే ఇప్పుడు ఇలాంటి విమర్శలకు దారి తీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.