ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త

SMTV Desk 2019-04-02 19:19:12  private employs, pension, SC EPFO Plea, kerala high court

కేరళ : ప్రైవేట్ ఉద్యోగులకు కేరళ హైకోర్టు ఓ శుభవార్త తెలిపింది. ఇకపై ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ అందుకోవచ్చు అని తీర్పునిచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం కేరళ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్‌వో చేసిన అప్పీల్‌ను తిరస్కరిచింది. దీంతో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అధిక పెన్షన్ అందనుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి ఆఖరి పూర్తి వేతనం ప్రాతిపదికన పెన్షన్ అందించాలని కేరళ హైకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎఫ్‌వో దీనికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తలుపుతట్టింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో రూ.15,000 ప్రాతిపదికన పెన్షన్ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టులో ఈపీఎఫ్‌వో అప్పీల్ తిరస్కరణ నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ కొన్ని వందల శాతం పెరగనుంది. అదేసమయంలో ప్రావిడెంట్ ఫండ్ వాటా తగ్గొచ్చు. అదనపు కంట్రిబ్యూషన్ అనేది పీఎఫ్‌కు కాకుండా ఈపీఎస్‌కు వెళ్తుంది. పెన్షన్ అధిక మొత్తంలో వస్తుండటంతో దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.