హైదరాబాద్ : ఐపీఎల్ 2019 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఓటమిపాలవుతూ వస్తుంది. ఈ సీజన్లో ఇంతవరకు గెలుపు రుచి చూడలేదు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం గెలుపు అంచుల వరకు వచ్చి ఓడింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో 70 పరుగులకే ఆలౌటైంది.అయితే ఈ వైఫల్యాలపై ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఓటమి అనంతరం హోటల్కు వెళ్లేటప్పుడు నేను, విరాట్ కోహ్లీ బస్సులో వెనుక సీట్లలో కూర్చున్నాం. ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. ఆ సమయంలో మాట్లాడటానికి ఇద్దరికీ మాటలు రాలేదు. కారణం సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో అంత ఘోర పరాజయాన్ని మేము ఊహించలేదు" అని చెప్పాడు. "మేము కోరున్నది ఇది కాదు. గత రెండు వారాల నుంచి మా జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. మా ప్రిపరేషన్ కూడా అద్భుతంగా ఉంది. దీంతో పాటు జట్టు కూడా సమతూకంగా ఉంది. ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయి ఉండొచ్చు. ఇకపై అడే అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తాం. మాపై మాకు నమ్మకం ఉంది" అని డివిలియర్స్ అన్నాడు.