తెరాస ఆకర్ష్కు ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ కుదైలైపోతోంది. ఇప్పటికే తెలంగానలో టీడీపీ కనుమరుగైపోయింది. ఆ పార్టీకి వున్న ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ఇటీవలే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటక వీరయ్య టీడీపీని వీడి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఆ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఒకే ఒక్కరున్నారు ఆయనే అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా వెంటకేశ్వరరావు. ఆయన్ని కూడా తెరాసలోకి లాగాలని విశ్వప్రయత్నాలు జరిగాయి. ఓ దశలో ఆయనకు భారీ ఆఫర్ని కూడా తెరాస అధినాయకత్వం ఇచ్చిందని తెలిసింది.
అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా వెంటకేశ్వరరావు తెరాసలో చేరితే ఖమ్మంలో తమ బలాన్ని పెంచుకోవచ్చనేది తెరాస శ్రేణుల ప్యూహం. అయితే ఆ ప్యూహం తాజాగా బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. మెచ్చా వెంటకేశ్వరరావు తెరాసలో చేరితే భారీ మొత్తం అందజేస్తామని తెరాస వర్గాలు ఆయనకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆఫర్ను ఆయన సున్నితంగా తిరస్కరించారట. శాసన సభ సమావేశాల సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనని ఛాంబర్కు పిలిపించి చర్చించారని, ఆయినా తాను పార్టీ మారడానికి అంగీకరించలేదని మెచ్చా వెంటకేశ్వరరావు వెల్లడించడం కలకలం రేపుతోంది. స్వయంగా సీఎం ఆఫర్ ఇచ్చినా తోసిపుచ్చి టీడీపీలోనే కొనసాగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.