పాట్నా: బిహార్లో ఓ ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక పది పాస్ అయి ఇంటర్ చదువుతుందని అతి కిరాతకంగా గ్రామస్తులు హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ముజఫర్ నగర్ జిల్లాలోని సన్పూరా గ్రామంలో ఆశా అనే అమ్మాయి టెన్త్ అయిన తరువాత ఇంటర్ చదువుతోంది. ఆ తెగ ఆచారం ప్రకారం బాలికలు పదో తరగతి వరకే చదవాలని ఉంది. అమ్మాయి ఇంటర్ లో జాయిన్ కావడంతో ఆ తెగకు చెందిన ఏడుగురు వ్యక్తులు బాలికను హత్య చేశారు. ఆశా సోదరుడు బాబన్ రాయ్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.