నిజామాబాద్ : లోక్ సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ ఎంపి స్థానానికి పసుపు రైతులు...ఎన్నికల్లో ఈవిఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్సిన్హా మాట్లాడుతూ...లోక్సభ స్థానానికి ఈవీఎంలతోనే ఎన్నికల నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ పోలింగ్ విషయమై పూర్తిస్థాయిలో చర్చించినట్లు ఆయన తెలిపారుఅభ్యర్థులు భారీగా ఉన్నప్పుడు ఈవీఎం, వీవీప్యాట్లు వాడటం ఇదే తొలిసారన్నారు. ఈవీఎంలను మొదటిసారి హైదరాబాద్లోనే తయారు చేశారని.. ఎక్కువమంది అభ్యర్థులకు ఈవీఎంలతో పోలింగ్ జరపటం కూడా ఇక్కడే చరిత్రగా నిలుస్తుందన్నారు. ఇప్పటి వరకు గరిష్టంగా 4 బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించినట్లు తెలిపిన ఉమేష్సిన్హా మొదటిసారి నిజామాబాద్లో 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. 25 వేల బ్యాలెట్ యూనిట్లు, 2 వేల కంట్రోల్ యూనిట్లు అవసరమన్నారు. రేపటి నుంచి ఫస్ట్ లెవల్ ఈవీఎం చెకింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రంలోగా ఈవీఎంలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రేపట్నుంచి నిజామాబాద్లో 600 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు. పోలింగ్ పూర్తయ్యే వీరంతా నిజామాబాద్లోనే ఉండనున్నట్లు పేర్కొన్నారు.