న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారత ఎన్నికల సంఘం నాలుగో విడత పోలింగ్కు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 9 రాష్ట్రాల్లోని 71 లోక్ సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన చేపడుతారు. ఏప్రిల్ 12వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కలిపించారు. నాలుగో విడతలో భాగంగా బిహార్లోని 5 స్థానాలకు, ఝార్ఖండ్లోని 3, మధ్యప్రదేశ్లోని 6, మహారాష్ట్రలోని 17, ఒడిశాలోని 6, రాజస్థాన్లోని 13, ఉత్తరప్రదేశ్లోని 13, పశ్చిమబెంగాల్లోని 8 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. బిజెపి, ఆర్ జెడి, సిపిఐ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న బిహార్లోని బెగుసరాయ్లో ఈ విడతలోనే ఎన్నికలు జరుగుతాయి.