కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ లో భద్రతా బలగాల ఎన్ కౌంటర్ లో పది మంది తాలిబన్లు హతమయ్యారు. బాగ్లాన్ ప్రావిన్స్ లో తాలిబన్లు సంచారిస్తున్నారని సమాచారం రావడంతో ఆఫ్ఘన్ భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. తాలిబన్లకు, భద్రతా బలగాలకు మధ్య భీకరమైన కాల్పులు జరగడంతో పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులలో తాలిబన్ కమాండర్ ముల్లాహ్ మనన్ ఉన్నట్టు భద్రతాధికారి వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి 20 మంది తీవ్రవాదులు తప్పించుకోవడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని ఆర్మీ అధికారి మహ్మద్ హనీఫ్ రిజై తెలిపారు. అప్ఘాన్ భద్రత బలగాలలో పది సైనికులు గాయపడినట్టు సమాచారం.