చంద్రబాబుకి ఓటేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కనుమరుగు

SMTV Desk 2019-04-02 15:58:40  jagan, chandrababu,

c బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మళ్లీ చంద్రబాబుకి ఓటేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కనుమరుగు అవుతాయని... ఎల్ కే జి ఫీజులు లక్షల్లో ఉంటాయని ధ్వజమెత్తారు. పెద్దాపురం నియోజకవర్గంలో గిట్టుబాటు ధరలు అందక రైతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకున్నానన్న జగన్ పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతి నడుస్తోందని.. యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి పోలవరం ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని జగన్ ఆరోపించారు.

అదేవిధంగా ఆయన మాట్లాడుతూ... ఈ 5 సంవత్సరాల పాలనలో మనకి కనిపించినది మోసమేనని తెలిపారు. 44 లక్షల ఫెన్షన్ కార్డులను 36 లక్షలకు తగ్గించారని.. బాబుకి ఓటేస్తే మీ ఇళ్ళు, పొలాలు తనకి నచ్చిన రేటుకే లాక్కుంటారని జగన్ హెచ్చరించారు. బాబు పాలనలో ఇసుక, మట్టి, పొలాలు కొండలు ఏవీ మిగలడం లేదని.. భూములు లాక్కోవడానికి భూ సేకరణల చట్టానికి బాబు సవరణలు కూడా చేస్తారని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.