శ్రీవారి ఆశీర్వాదం కోసం

SMTV Desk 2019-04-02 13:52:04  samantha, tirumala

సమంత, నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మజిలీ చిత్ర బృందం తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళింది. చిత్ర బృందం మొత్తం కారులో కొండపైకి చేరుకుంటే.. సమంత మాత్రం కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు. సమంత సామాన్య భక్తులతో కలిసి ఏడు కొండలు ఎక్కారు. మధ్య, మధ్యలో భక్తుల పలకరింపులతో పాటూ వారితో సెల్ఫీలు దిగి సరదాగా గడిపారు. సమంత సరిగ్గా సోమవారం రాత్రి 10 గంటలకు కొండపైకి చేరుకున్నారు.

మంగళవారం రోజున మజిలీ చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకోనుంది. నిజ జీవిత దంపతులు నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న మజిలీ చిత్రానికి నిన్నుకోరి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శాత్వం వహించాడు. శ్రీవారి ఆశీర్వాదం కోసం నాగచైతన్య, బ్రహ్మానందం కారులో తిరుమలకు రాగా.. సమంత మాత్రం కాలిబాటన వచ్చి మొక్కు తీర్చుకున్నారు. సమంత కాలినడకన తిరుమలకు చేరుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.