పళనిస్వామికి చేదు అనుభవం

SMTV Desk 2019-04-02 13:51:11  palanaswamy,

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఈ క్రమంలో తంజావూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి చేదు అనుభవం ఎదురైంది.

ఆయన ప్రసంగిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయనపైకి చెప్పులు విసిరాడు. దీంతో ప్రచారంలో ఒక్కసారిగా కలకలం రేగింది. భద్రతా పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, సిబ్బంది కొరవడడం వల్లే ఈ ఘటన జరిగినట్టుగా అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. సీఎంపైకి చెప్పులు విసిరిన వ్యక్తిని ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేదు.