అయ్యో నాకు ఆ విషయం జ్ఞాపకం లేదు క్షమించండి

SMTV Desk 2019-04-02 13:50:27  modi, dathtreya

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ దక్షిణాదిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రోజున హైదరాబాద్. రాజమహేంద్రవరంలో ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగిన విజయ్‌ సంకల్ప్‌ సభలో పాల్గొన్న సందర్భంగా మోదీ మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో కొంత సమయం ముచ్చటించారు.

ఈ సందర్భంగా మోదీ దత్తాతేయ జుట్టు వైపు చూస్తూ ప్రతి ఏడాది హోలీ తర్వాత ‘రెండుమూడు నెలలపాటు మీ జుట్టు ఎర్రగా ఉండేది, ఈసారి తెల్లగా ఉందేం?’ అని ప్రశ్నించారు. దానికి దత్తాత్రేయ స్పందిస్తూ ‘కొద్దికాలం క్రితం మా అబ్బాయి గుండెపోటుతో మృతిచెందాడని అందుకే ఈసారి హోలీ ఆడలేదని, అందుకే జుట్టు తెల్లగా ఉందని’ చెప్పారు. దీనికి మోదీ స్పందిస్తూ ‘అయ్యో నాకు ఆ విషయం జ్ఞాపకం లేదు క్షమించండి’ అని అన్నారు.