ఢిల్లీపై పంజాబ్ ఘన విజయం

SMTV Desk 2019-04-02 10:47:40  delhi, punjab

ఐపిఎల్‌-2019లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. అయితే గెలవాల్సిన మ్యాచ్‌ను ఢిల్లీ జట్టు చేజార్చుకుంది. బౌలింగ్ మాయతో పంజాబ్ విజయం సాధించింది.

టాస్ నెగ్గిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులకు కట్టడి చేసింది. అయితే తర్వాత ఛేజింగ్‌లో దూకుడు ప్రదర్శించినప్పటికీ చివరిలో మాత్రం చతికిలపడింది.

చివరి 24 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. పైగా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఈ స్థితిలో కచ్చితంగా గెలవడం ఖాయం. కానీ ఓడిపోయింది. ఆలౌటై 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2.2 ఓవర్లలోనే 4 వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ శ్యామ్ కర్రేన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

స్కోర్ వివరాలు..
పంజాబ్ జట్టు: 166/9(20 ఓవర్లలో)
ఢిల్లీ జట్టు: 152/10(19.2 ఓవర్లలో)